calender_icon.png 11 October, 2024 | 2:57 AM

గీతన్నల క్షేమానికే కాటమయ్య కిట్లు

11-10-2024 12:39:32 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, అక్టోబరు 10: గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకే రాష్ట్రప్రభుత్వం కాటమయ్య కిట్లు పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో గురువారం ఆయన గీత కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు.

ఈ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 100 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో 10 వేల కిట్లు పంపిణీ చేశామన్నారు. కిట్లను గీతన్నలు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం తాను హుస్నాబాద్, ధర్మపురి, మానకొండూర్, మంథనిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో, అధికారులు పాల్గొన్నారు.