calender_icon.png 10 March, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిచెన్ టిప్స్

09-03-2025 12:00:00 AM

* బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డ్రమ్ములో బిర్యానీ ఆకులు, ఎండుమర్చి ఉంచాలి.

* పెరుగు పుల్లగా ఉంటే దానిలో మూడు చెంచాల పాలు వేసి బాగా గిలకొట్టాలి. ఇలా చేస్తే దాంట్లో ఉండే పులుపు తగ్గి, రుచి పెరుగుతుంది.

* స్వీట్స్ చేసేటప్పుడు చక్కెరకు బదులు.. చక్కెర పౌడర్ వేస్తే రుచి పెరుగుతుంది. 

* క్యాబేజీ ఉడికించేటప్పుడు కాస్త వెనిగర్, నాలుగు లవంగాలు వేస్తే వాసన రాకుండా ఉంటుంది.

* ఎండు కొబ్బరి ముక్కలు వాసన రాకుండా ఉండాలంటే వాటిని కందిపప్పు డబ్బాలో భద్రపరచాలి.