calender_icon.png 2 October, 2024 | 1:54 PM

స్వచ్ఛతా హి సేవలో పాల్గొని రోడ్లు శుభ్రం చేసిన కిషన్ రెడ్డి

02-10-2024 10:59:39 AM

హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్, ఎంజీ రోడ్డు మహాత్మ గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పారడైజ్ కలాసిగూడ పార్క్ లైన్ రోడ్ లోని వీధుల్ల్ని ఊడ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని గత పదేళ్ల క్రితం నరేంద్రమోడీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని బిజెపి ప్రభుత్వం చేపట్టింది.  మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. స్వచ్ఛత విషయంలో పరిశుభ్రత విషయంలో ప్రభుత్వాలే కాదు ప్రజల సహకారం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అన్నారు. 


భారత్ అతిపెద్ద దేశం కోట్ల మంది ప్రజలు దేశంలో నివసిస్తున్నారు. పరిశుభ్రత స్వచ్ఛత లేకపోతే దేశం.. ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది అందుకే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు.  ఐఏఎస్ నుంచి ఐపీఎస్ వరకు స్కూల్ తరగతి గది నుంచి పట్టణాల వరకు ఈ స్వచ్ఛత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు.. ఇది చాలా మంచి పరిణామన్నారు. స్వాతంత్ర ఉద్యమం సమయంలో గాంధీ స్వాతంత్రం కావాలా... స్వచ్ఛత కావాలా అని .. అడిగితే.. స్వచ్ఛత ముందు కావాలి.. స్వతంత్రం ఎలాగైనా వస్తుందని గాంధీ చెప్పిన సందర్భాన్ని కిషన్ రెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ లో  ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని అన్ని వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చారు. మన పరిసరాలను మన ప్రాంతాల్ని శుభ్రం ఉంచుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. మన దేశంలో ఆరోగ్యవంతమైన ప్రజలు ఆరోగ్యవంతమైన దేశంగా చూడాలనే లక్ష్యంతో మోదీ ఈ కార్యక్రమాన్ని తీసుకోచ్చారని తెలిపారు.  స్వచ్ఛభారత్  అంటే ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇదో ప్రజా ఉద్యమంగా చూడాలని కోరారు. జాతిపిత గాంధీ ఆలోచన.. మోడీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.