calender_icon.png 6 October, 2024 | 2:40 PM

సికింద్రాబాద్-గోవా వీక్లి ట్రైన్ ప్రారంభం

06-10-2024 12:49:58 PM

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ వాస్కోడిగామా మధ్య రైలు ఆదివారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం-10 నుంచి రైలు ను జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్- వాస్కోడిగామా రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉండనుంది. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు బయల్దేరనుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్ లో రైలు ఆగనుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్ కు గురు, శనివారాల్లో ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనుంది.