calender_icon.png 26 October, 2024 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సొంత జిల్లాలో బీజేపీ జెండా ఎగిరింది: కిషన్ రెడ్డి

12-07-2024 12:16:11 PM

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం శుక్రవారం జరుగుతోంది. శంషాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. ఈ భేటీకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బంఢి సంజయ్ కుమార్, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కార్యకర్తలకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ అన్నారు. కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ పాలనపై సుదీర్ఘ పోరాటం చేశామన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహించిన మాల్కాజ్ గిరిపై కాషాయ జెండా ఎగిరిందని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం సొంత జిల్లాలో కూడా బీజేపీ జెండా ఎగిరిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు 14 నుంచి 35 శాతానికి పెరిగిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.