calender_icon.png 14 October, 2024 | 3:51 PM

ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం.. కిషన్ రెడ్డి సీరియస్

14-10-2024 01:46:03 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ డివిజన్, కుమ్మరవాడ లో పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రాచీన ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కొంతమంది మతోన్మాద శక్తులు దాడికి పాల్పడి మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడి చేసిన వారు మతిస్థిమితం లేకుండా చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. డీజేలు పెడితే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులు.. ఇలాంటి ఘటనలు జరిగితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడినవారు ఎంతటివారైనా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గణేష్ నవరాత్రులలో డీజేలు, పూజలు ఆపే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.