calender_icon.png 3 October, 2024 | 2:47 PM

సభ్యత్వ నమోదుపై కిషన్‌రెడ్డి సమీక్ష

03-10-2024 02:22:21 AM

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొనసాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదుపై బుధవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన సభ్యత్వ నమోదు వివరాలను సభ్యత్వ నమోదు చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావును అడిగి తెలుసుకున్నారు. లక్ష్యానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, కొల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.