హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి సునీల్ బన్సల్, సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ చేతుల మీదుగా కిషన్రెడ్డి సభ్యత్వాన్ని తీసుకున్నారు. బీజేపీలో క్రియాశీల సభ్య త్వం ఉన్న వారికే ఎన్నికల్లో పోటీ చేయడానికి, పదవులను స్వీకరించడానికి అర్హత లభి స్తుంది. ౧00 మందిని పార్టీ సభ్యులుగా చేర్పించిన వారికి ఈ సభ్యత్వాన్ని ఇస్తారు.