calender_icon.png 3 October, 2024 | 2:41 PM

కొండా సురేఖ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

03-10-2024 11:56:23 AM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదని సూచించారు. కేసీఆర్ మొదలుపెడితే కేటీఆర్ ముందుకు తీసుకువెళ్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి విధానాలు సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారని వెల్లడించారు. ఏ హక్కుతో ఫోన్ ట్యాపింగ్ చేశారు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్.. ఫోన్ ట్యాపింగ్ చేసి, వారి అంతర్గత విషయాలు విన్నారని కోర్టులో అఫిడవిట్ ఇచ్చారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి బ్యాక్ మెయిల్ తో రూ. కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను మీడియా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కేంద్రమంత్రి కోరారు. రాజకీయాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ను బహిష్కరించాలన్నారు.