calender_icon.png 23 October, 2024 | 11:53 PM

నామినేటెడ్ పోస్టుల్లో కిసాన్ కాంగ్రెస్‌కు ప్రాధాన్యం

23-10-2024 12:00:00 AM

పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కిసాన్ కాంగ్రెస్ పాత్ర ఎంతో కీలకమని పీసీ సీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ లు, ఆత్మ కమిటీల్లో అవకాశాలు ఇస్తామని ఆయన తెలిపారు.

మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్య వర్గం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. కిసాన్ కాంగ్రెస్ నాయకులకు పార్టీ లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని చెప్పారు.

రుణమాఫీని దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని, రూ. 18 వేల కోట్లు రుణమాఫీ చేశామని, రైతుబంధు కూడా ఇచ్చామని తెలిపా రు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా సమాచారం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి రైతులు కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా కార్యాచరణ తీసుకోవాలని చెప్పా రు.

బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై దిగజారి మాట్లాడుతున్నారని, కోట్లాది రూపాయలు వ్యయం చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.