- తల్లిదండ్రులు ఉన్నా కానీ కోడలికే అవార్డు
- అవార్డు, డబ్బులతో వెళ్లిపోయిన స్మృతి
లక్నో, జూలై 12: సియాచిన్లో తన సహచర సైనికుల్ని అగ్ని ప్రమాదం నుంచి కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ అమరీందర్ సింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అతడి ధైర్యసాహసాలకు మెచ్చిన ప్రభుత్వం మరణానంతరం కీర్తి చక్ర అవార్డుతో సత్కరించింది. జూలై 5వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తల్లి, భార్య అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు కొంత నగదు కూడా లభించింది.
కీర్తి చక్రతో వెళ్లిపోయిన కోడలు..
కెప్టెన్ అన్షుమన్ సింగ్ సేవలకు గాను ప్రభుత్వం ఇచ్చిన కీర్తి చక్ర అవార్డు, దానితో పాటు వచ్చిన నగదును తమ కోడలు స్మృతి తీసుకుని వెళ్లిపోయిందని అంతే కాకుండా కొ డుకు ఫొటో ఆల్బమ్, బట్టలు, ఇతర జ్ఞాపకాలను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయింద ని అన్షుమన్ సింగ్ తండ్రి రవిప్రతాప్ సింగ్ మీడియాతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. అంతే కాకుండా తాను అడ్రస్ కూడా మార్చుకున్నట్లు వాపోయాడు.