calender_icon.png 19 March, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్యాయంగా చంపారు..

18-03-2025 08:44:00 PM

నేను.. నా పిల్లలు ఎట్లా బతికేది.. 

దవాఖాన ఎదుట ఆందోళన.. 

వైద్యం అందక వ్యక్తి మృతి.. 

హస్తినాపురంలోని అరుణ దవాఖానలో ఘటన...

ఎల్బీనగర్: కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తి దవాఖానలో చేరితే సరైన వైద్యం అందిచకపోవడంతోనే తన భర్త మృతి చెందాడని... ఇప్పుడు నేను నా పిల్లలు ఎట్లా బతికేది అని మృతుడి భార్య రోదనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ ఘటన హస్తినాపురంలోని అరుణ దవాఖానలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న గ్రామానికి చెందిన బొమ్మకంటి నరేశ్ (32) భార్య మాధవి, ఇద్దరు ఆడపిల్లలలో కలిసి బీఎన్ రెడ్డి నగర్ లోని చైతన్యనగర్ కాలనీలో నివాసముంటున్నారు. కాగా, మంగళవారం ఉదయం నరేశ్ కడుపునొప్పితో బాధపడుతుండగా... కుటుంబ సభ్యులు వెంటనే హస్తినాపురం లోని అరుణ దవాఖానలో చేర్పించారు.

చికిత్స పొందుతూ సాయంత్రం నరేశ్ మృతి చెందాడు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో పాటు సరియైన చికిత్స ఇవ్వకపోవడంతో నరేశ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య మాధవి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. అయితే, ఇంత జరుగుతున్నా దవాఖాన యాజమాన్యం స్పందించలేదు. తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.