calender_icon.png 17 October, 2024 | 4:04 AM

నిమ్స్‌లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు

17-10-2024 01:10:42 AM

ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేసిన డాక్టర్లు 

డాక్టర్లు, సిబ్బందిని అభినందించిన మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): 10 నెలల్లోనే వందకుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన ప్రభుత్వ దవాఖానగా నిమ్స్ హాస్పిటల్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు 101 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశామని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప బుధవారం ప్రకటించారు.

ఇందులో 55 కిడ్నీలను బాధిత పేషెంట్ల కుటుంబ సభ్యులు డొనేట్ చేయగా, ఇంకో 46 కిడ్నీలను బ్రెయిన్ డెత్ కేసుల నుంచి సేకరించి పేషెంట్లకు అమర్చామని ఆయన తెలిపారు. ఇవికాకుండా 4 లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు, ఒక హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ కూడా చేశామని ఆయన వెల్లడించారు. ఈ సర్జరీలన్నీ ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చేశామన్నారు.

పేషెంట్లకు అవసరమైన మెడిసిన్ కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు అవసరమైన అన్నీ సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పూర్తి సహకారంతో తాము ఈ ఘనత సాధించగ లిగామన్నారు.

ఆరోగ్యశ్రీ కింద ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్యాకేజీల ధరలను కూడా సవరిం చడంతో, పేషెంట్లకు అవసరమైన అన్ని రకా ల సదుపాయాలను కల్పించగలుగుతున్నామని ఆయన తెలిపారు. అతి తక్కువ సమ యంలో వందకు పైగా ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసి, పేదలకు వైద్య సేవలు అందించడంలో నిమ్స్ మరోసారి తన కమిట్‌మెంట్‌ను చాటుకుందన్నారు.

నిమ్స్ వైద్యులకు మంత్రి అభినందనలు

ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసి వందల మందికి పున ర్జన్మను ప్రసాదిస్తున్న నిమ్స్ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ అభినందించారు. నిమ్స్‌తో పాటు, గాంధీ, ఉ స్మానియా హాస్పిటల్స్‌లోనూ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా మని తెలిపారు. అవసరమైన పేషెంట్లకు ప్రభుత్వ దవాఖాన్లలో ఉచి తంగా అవయవ మార్పిడి సర్జరీలు చేయిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ప్యా కేజీలను సవరించి, ట్రాన్స్‌ప్లాంటేషన్ పేషెంట్లకు జీవితకాలం అవసరమైన మెడిసిన్‌ను అందజేస్తున్నామన్నారు.