నిజామాబాద్లో ఘటన
కామారెడ్డి(నిజామాబాద్), అక్టోబర్ 19 (విజయక్రాంతి): నిజామా బాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏడాది వయస్సున్న బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మి అనారోగ్యానికి గురడంతో చికిత్స నిమిత్తం శుక్రవారం నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకుళ్లారు.
బెడ్పై లక్ష్మి చికిత్స పొందు తుండగా ఆమె భర్త రాజు, కుమారుడు మణికంఠ ఆవరణలో రాత్రి నిద్రించారు. గుర్తు తెలియని ము గ్గురు దుండగులు బాలుడ్ని ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం గమనిం చిన రాజు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సమా చారమిచ్చాడు.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లినట్లు నమోదైంది. ఈ మేరకు వన్ టౌన్ పోలీ సులకు రాజు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిం పు చేపట్టారు. గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో ఒక బాలుడు కిడ్నాప్ గురైన ఘటన మరవకముందే మరో బాలుడు కిడ్నాప్ గురవడం కలకలం రేపుతున్నది.