నిందితుడిని పట్టుకొని చితకబాదిన స్థానికులు
రాజేంద్రనగర్, అక్టోబర్24: బాలుడి కిడ్నాప్కు యత్నించాడనే నెపంతో ఓ మందుబాబును స్థానికులు చితకబాదిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థాని కుల కథనం ప్రకారం.. హైదర్గూడలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం సమీపంలో గురువారం ఓ బాలుడు తన సైకిల్పై వెళ్తున్నాడు. దారిలో ఓ యువకుడు మద్యం మత్తులో అతడి వద్దకు వచ్చి సైకిల్ ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లాక బాలుడిని వెనుక కూర్చోమని చెప్పి తాను సైకిల్ నడిపాడు. దీంతో బాలుడు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే సైకిల్ దిగి విషయం స్థానికులకు చెప్పడంతో.. వారు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే నిందితుడి వద్ద ఎటువంటి ఆధార పత్రాలు లేకపోవడం, అతడు మత్తులో ఉండటంతో అతడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదని సమాచారం. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.