calender_icon.png 27 September, 2024 | 6:52 AM

కిడాంబి శ్రీకాంత్ శుభారంభం

26-09-2024 12:00:00 AM

మకావు: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మకావు ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశాడు. బుధవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-14, 21-15తో ఇజ్రాయెల్ షట్లర్ డానిల్ దుబొవెంకోను చిత్తుగా ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో ఆయుశ్ శెట్టి 21-13, 21-5తో మన దేశానికే చెందిన అలప్ మిశ్రాను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో తన్సిమ్ మిర్ 15-21, 21-18, 22-20తో దేవిక సిహాగ్‌ను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాదీ ద్వయం సుమిత్- సిక్కిరెడ్డి కూడా ముందంజ వేశారు.