calender_icon.png 11 October, 2024 | 5:01 AM

భారత్ వేదికగా ఖోఖో ప్రపంచకప్

03-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఖోఖో వరల్డ్‌కప్‌కు భారత్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ వరల్డ్‌కప్‌లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయని సమాచారం. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌ఐ) ఈ మేరకు బుధవారం ప్రకటించింది. ‘2032 వరకు ఖోఖో ను ఒలింపిక్స్‌లో చూడటమే తమ లక్ష్యం’ అని కేకేఎఫ్‌ఐ అధ్యక్షుడు సుధాంశు మిట్టల్ తెలిపారు.