calender_icon.png 29 April, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ

29-04-2025 11:31:01 AM

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై చర్చించడానికి, ఏకధాటిగా ఉండి పోరాడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనలో అమాయక పౌరులు 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత, దేశాన్ని దుఃఖంలో ముంచెత్తింది. ఈ దారుణ సంఘటనకు సరిహద్దు దాటి సంబంధాలున్నాయని భారతదేశం పేర్కొంది. ఈ దాడిలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది.

ఐక్యత, సంఘీభావం అవసరమైన ఈ తరుణంలో వీలైనంత త్వరగా పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమని ప్రధానమంత్రికి రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు. క్రూరమైన ఉగ్రవాద దాడిని ఎదుర్కోవడానికి మా సమిష్టి సంకల్పం సంకల్ప శక్తికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుందని, సమావేశాలు తదనుగుణంగా నిర్వహించబడతాయని తాము ఆశిస్తున్నామని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు తెలిపారు.

రాహుల్ గాంధీ కూడా ఇదే అభ్యర్థనతో మోడీకి ఒక లేఖ రాశారు. పహల్గామ్ విషాదం ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని, ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం ఎల్లప్పుడూ కలిసి ఉంటామని భారతదేశం నిరూపించాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వీలైనంత త్వరగా ఇటువంటి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తాము అభ్యర్థిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు.