calender_icon.png 27 September, 2024 | 10:51 PM

ఖమ్మంను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

26-09-2024 01:17:34 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఖమ్మం కీర్తి ప్రతిష్టలు రాష్ట్రం నలుదిశలా వ్యాపించేలా ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం 16వ డివిజన్‌లోని శ్రీరామ్‌నగర్‌లో మురుగు కాల్వల ని ర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అ భివృద్ధి చేస్తానని అన్నారు. కాగా అభివృద్ధి ప నులను నాణ్యత చేపట్టాలని ఆదేశించారు.  నాలాలు, చెరువులు, రోడ్ల ఆక్రమణలు నివారించాలన్నారు.

ఏవైనా ఆక్రమణలు  తొలగి ంచాల్సిన పరిస్థితుల్లో పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పారు. వె లుగుమట్ల పార్క్ అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పి నీ రజ, కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు, న గర సహాయ కమిషనర్ సంపత్ పాల్గొన్నారు.