ఇజ్రాయెల్ను బెదిరించిన రెండు రోజులకే ఘటన
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీఖమే నీ ‘ఎక్స్’ ఖాతా ను ఆ సంస్థ సస్సెండ్ చేసింది. ఇజ్రాయెల్ను బెదిరిస్తూ పోస్టు పెట్టిన రోజులకే ఖమే నీ ఎక్స్ ఖాతా సస్పెండ్ అయింది. తమ దాడులతో టెహ్రాన్కు భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖమేనీ కొత్తగా ఎక్స్ ఖాతా ను తెరిచారు.
అందులో ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టారు. ‘ఇరాన్ను తక్కవ అంచనా వేసి జియోని స్టు పాలన తప్పు చేసింది. ఇరాన్కు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా యో మేం చూపి స్తాం’ అని రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఖమేనీ ఎక్స్ ఖాతాను ఆ సంస్థ సస్పెండ్ చేసింది. అయితే ఖమేనీ పేరుతో ఉన్న మరో అధికారిక ఖాతాపై ఎక్స్ సంస్థ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.