calender_icon.png 19 October, 2024 | 10:03 AM

4.5 కిలోల అండాశయ కణతి తొలగింపు

16-10-2024 01:37:50 AM

మహిళను ప్రాణాప్రాయం నుంచి రక్షించిన వైద్యులు

కామారెడ్డి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పిట్లం తండాకు చెందిన మెగావత్ లలిత(41) అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 10న ఎల్లా రెడ్డి పట్టణంలోని ఎల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు స్కానింగ్ చేయగా కడుపులో అండాశయ కణతి ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం శస్త్ర చికిత్స చేసి 4.5 కిలోల అండాశయ కణతిని వైద్యుడు రవీంద్రమోహన్ తొలగించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు శస్త్ర చికిత్స చేసి కణతిని తొలగించడంతో రోగి బంధువులు డాక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.