షాప్ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): హోటళ్లు, రెస్టారెంట్లకు చికెన్ సరఫరా చేస్తున్న ఓ షాప్పై అధికారులు దాడులు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 700 కిలోల కుళ్లిన చికెన్ స్టాక్ బయటపడింది. వివరాలిలా ఉన్నాయి.. ఫుడ్ సేఫ్టీ, టాస్క్ఫోర్స్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు బేగంపేట ప్రకాశ్ నగర్లోని బాలయ్య చికెన్ షాప్లో శుక్రవారం దాడులు నిర్వహించారు.
సుమారు 700 కిలోల చికెన్ను నెల రోజులకు పైగా ఫ్రిజ్లో ఉంచినట్టుగా అధికారులు గుర్తించారు. కుళ్లిన చికెన్, కొవ్వు పదార్థాలకు కెమికల్స్ వేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు, పలు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. కుళ్లిపోయిన చికెన్తో పాటు కొవ్వు పదార్థాల శాంపిళ్లు తీసుకున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారి మారుతి తెలిపారు. ఇంకా ఇలాంటి చికెన్ షాపులు నగరంలో ఎన్ని ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.