calender_icon.png 17 October, 2024 | 12:26 AM

రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు

16-10-2024 03:28:55 AM

జార్ఖండ్ పరిశీలకుడిగా డిఫ్యూటీ సీఎం భట్టి 

మరఠ్వాడ సీనియర్ అబ్జర్వర్‌గా మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): త్వరలో జరుగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ రెండు రాష్ట్రాలకు మంగళవారం పార్టీ రాష్ట్ర పరిశీలకులను నియమించింది. మన రాష్ట్రానికి చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు.

కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ రాష్ట్ర పరిశీలకుడిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నియమించారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ రీజియన్‌కు సీనియర్ అబ్జర్వర్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.