టీజీఐఐసీ సీఎండీ విష్ణువర్ధన్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాం తి): ఎంఎస్ఎంఈ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేయనున్నట్లు టీజీఐఐసీ సీఎండీ విష్ణువర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన ఇష్ఠాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ఇన్క్లూజివ్, సస్టునబుల్, ఇండస్ట్రీ రెడీ.. అనే మూడు సూత్రాల ఆధారంగా టీజీఐఐసీ కొత్త లోగో రూపొందించామన్నారు. ఇష్ఠాగోష్ఠిలో ఇండస్ట్రీయల్ డెవల్మెంట్ కమిటీ చైర్మన్ గరిమెళ్ల శ్రీనివాస్, ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ సురేష్కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.