నైరోబీ (కెన్యా), సెప్టెంబర్ 8: కెన్యాలోని నైరీ కౌంటీలో ప్రాథమిక పాఠశాల హాస్టల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. గురువారం అర్ధరాత్రి హాస్టల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ హాస్టల్లో 9 ఏళ్ల వయసున్న 156 మంది చిన్నారులు నిద్రిస్తుండగా ఈ ప్రమా దం జరిగింది. ఘటనాస్థలంలో 19 మంది మృతదేహాలు లభించాయని ప్రభు త్వం తెలిపింది. మిగిలినవారిని ఆసుపత్రికి తరిలించి నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరో ఇద్దరు చిన్నారులు చని పోయినట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన అధికారులు.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కెన్యాలోని పాఠశాలల్లో తరచూ ఇలాంటి అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన పాఠశాలలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నట్లు జాతీయ కమిషన్ చెబుతోంది.