ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి పుట్టిన రోజు గురువారం. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా కీరవాణితో కలిసి ‘ఆపద్బాం ధవుడు’ సినిమాకు పనిచేసినప్పటి అనుభవాలను పంచుకున్నారాయన. చిరంజీ వి తాజా చిత్రం ‘విశ్వంభర’కు కీరవాణి సంగీత సారథ్యం వహిస్తుండటం యాదృశ్చికం. ఈ క్రమంలో ‘విశ్వంభర’ కోసం కీరవాణి తన ఇంట్లో మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్న సందర్భంలో పాత రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ తన జ్ఞాపకాలను పంచుకుంటూ చిరంజీవి ఎక్స్లో చేసిన పోస్ట్కు ఓ వీడియో ట్యాగ్ చేశారు.
అందులో చిరంజీవి “ఒకప్పుడు అందరూ ఒకచోట చేరి.. సంగీత దర్శకు డి ఊహల్లో నుంచి ప్రవహిస్తున్న బాణీ లు బాగున్నాయో, లేదో చర్చించుకుని ఆమోద ముద్ర వేశాకే ఆ పాట బయటికి వచ్చేది. మరుగున పడిన ఆ ఆనవాయితీని గుర్తు చేస్తూ మళ్లీ మా కీరవాణి గారు ‘విశ్వంభర’ కోసం పాటలను కం పోజ్ చేసే ప్రక్రియ మా ఇంట్లో ఏర్పాటు చేశాం. అది జరుగుతున్న సందర్భంలో మాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి.
‘ఆపద్బాంధవుడు’ మ్యూజిక్ కంపోజ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి ఆ మధుర గీతాన్ని కీరవాణి ఆలపిస్తుంటే మనసు తియ్యని అనుభూతికి లోనయింది. దాన్ని మీతో ఇలా పంచుకోవాలని మీ ముందుంచుతున్నాను.. ప్లీజ్ ఎంజాయ్” అంటూ వీడియోలో తన మాటల్ని ముగించారు చిరంజీవి. ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా పనులు షెడ్యూల్ ప్రకారం చకచకా జరుగుతున్నాయి. తాజాగా డబ్బింగ్ పనులు మొదలుపెట్టినట్టు మేకర్స్ గురువారం వెల్లడించారు.