కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
కామారెడ్డి, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేం ద్రంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్త బస్టాం డ్ ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించారు. స్వచ్ఛభారత్ సంకల్పంతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ప్రహ్లాద్ జోషి అన్నారు.
అనంతరం తిలక్రోడ్డులో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. వ్యాపా ర సముదాయాల్లో సభ్యత్వ నమోదు నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్త బీజేపీ సభ్యత్వాన్ని విసృత్తంగా చేపట్టాలని సూచించారు.
20 కోట్ల సభ్య త్వం బీజేపీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే రమణారెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ మంత్రి నేరళ్ల ఆంజనేయులు, సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, రంజిత్మోహన్, రాంరెడ్డి, మహిపాల్, రాజు, గంగాధర్రావు, ఈశ్వర్, ఆకుల భరత్కుమార్, మోటురి శ్రీకాంత్, నరేందర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.