calender_icon.png 10 October, 2024 | 1:20 PM

జిల్లా గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ గా కెడం లింగమూర్తి

10-10-2024 11:28:59 AM

హుస్నాబాద్(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా హుస్నాబాద్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీసీసీ మెంబర్ కెడం లింగమూర్తి నీ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ను అక్కున చేర్చుకుంటుంది అని చెప్పడానికి తన నియామకం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. తన నియకమానికి సహకరించిన రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.