20-02-2025 12:17:25 PM
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) అధినేత కె. చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిని సందర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, సాధారణ వైద్య పరీక్షల(General medical examinations) కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తోంది. పరీక్షలు పూర్తి చేసుకున్న వెంటనే ఆయన ఇంటికి తిరిగి వస్తారని భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ నిన్న బహిరంగంగా కనిపించారు.
పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఏడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ వెళ్లడం విశేషం. పార్టీ నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ తెలంగాణకు రక్షణ కవచంగా మిగిలిపోయిందని చెప్పారు. పార్టీ బలంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, తదుపరి ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజారిటీని సాధించి తెంలగాణలో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు పెండింగ్లో ఉన్న తీర్పుపై కూడా కేసీఆర్ ప్రస్తవించారు. ఇది ప్రభావిత నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు దారితీయవచ్చని సూచించారు. రాబోయే రాజకీయ పరిణామాలకు పార్టీ సభ్యులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్పిలుపునిచ్చారు.