ఎమ్మెల్సీ బల్మూరు
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ కోవర్టు గా పనిచేశారని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆరోపించారు. ఒక ఆంబోతు ను వదిలేసినట్లుగా.. బీఆర్ఎస్ కౌశిక్రెడ్డిని వదిలిందని ఎద్దేవాచేశారు. శుక్రవారం వెంకట్ గాంధీభవన్లో మాట్లాడుతూ.. కౌశిక్రెడ్డి సూసైడ్ స్టార్ అని, మీడియా కవరేజీ కోసమే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులపై ఇష్టం వచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.