హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున షాక్ తగిలింది. నాగార్జునపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదైంది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని నాగార్జున పై ‘జనం కోసం’ సంస్థ ప్రెసిడెంట్ కసిరెడ్డి భాస్కరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వందల కోట్ల విలువైన చెరువు భూములును ఆక్రమించిన నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కసిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఫిర్యాదును మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ పంపారు. చెరువును కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా ఇప్పటికే కూల్చివేసింది.