21-04-2025 10:19:53 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు కర్నాటి కవితను కొత్తగూడెం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి (ఫస్ట్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్ జడ్జి)గా నియమితులయ్యారు. ఈ మేరకు నాంపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నుండి బదిలీపై సోమవారం కొత్తగూడెం కోర్టు కు వచ్చిన ఆమె..బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.