02-04-2025 12:23:11 AM
జహీరాబాద్, ఏప్రిల్ 1: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ పాటిల్ భీమ్రావు పాటిల్ ల తో పాటు మాజీ మంత్రి రాజశేఖర్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజ అనంతరం ఆలయ కార్య నిర్వహణ అధికారి విభూతి శివ రుద్రయ్య స్వామి వారికి ప్రసాదం అందజేశారు. జరా సంఘం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్ పూలమాల శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ పాటిల్ రుద్రయ్య స్వామి మల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.