కర్ణాటక,(విజయక్రాంతి): సిద్దరామయ్య పిటిషన్ ను మంగళవారం కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో సిద్ధరామయ్య విచారణ ఎదర్కొంటున్నారు. మూడా కుంభకోణంలో విచారణ ఎదుర్కొవాలని గతంలోనే గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆదేశించారు. అయితే గవర్నర్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ సిద్ధరామయ్య కర్ణాటక కోర్టు ఆశ్రయించారు. దీంతో ముడా కుంభకోణం కేసులో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారించింది. గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ కర్ణాటక సీఎం పిటిషన్ ను తిరస్కరించింది. మైసూరు నగరంలో సీఎం సీద్ధరామయ్య భార్యకు 14 స్థలాలు కేటాయించడంలో ముడాలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీఎం విచారణను ఎదుర్కొంటున్నారు.