calender_icon.png 7 October, 2024 | 1:54 AM

రాజ్ భవన్‌లో కర్మయోగి ఓరియంటేషన్

11-09-2024 01:31:20 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాజ్ భవన్‌లో మంగళ వారం గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో కర్మయోగి స్కీమ్ కింద ఓరి యంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలం గాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల రాజ్ భవన్‌లకు చెందిన సీనియర్ అధికారులు విధు ల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ విష్ణుదేవ్ వర్మ తాను త్రిపుర డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, నీతీ అయోగ్ పాల్గొన్నారు.