శాండల్వుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషా దం నెలకొంది. కన్న డ చిత్ర పరి శ్రమకు చెంది న ప్రముఖ దర్శకుడు దీపక్ ఆరస్ (42) కన్నుమూశారు. కొంతకాలం గా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న దీపక్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీపక్ మరణ వార్తను ఆయన సోదరి, ప్రముఖ నటి అమూల్య సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. దీపక్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలి యజేస్తున్నారు. దీపక్ ఆరస్ మనసాలజీ (2012), షుగర్ ఫ్యాక్టరీ (2023) వంటి చిత్రాల ద్వారా ఫేమస్ అయ్యారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా షుగర్ ఫ్యాక్టరీ చిత్రం రూపొం దింది. దీపక్ ఆరస్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమూల్య ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.