calender_icon.png 6 October, 2024 | 7:55 PM

కంపు.. రాజకీయాలకు ఇంపాయే

06-10-2024 02:07:15 AM

‘మూసీ’.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన అంశం. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మూసీనది నిండుగా ప్రవహిస్తున్నది. కొంతకాలం క్రితం వరకు మూసీని మురికి కూపంగా భావించేవారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూసీ సుందరీకరణపై దృష్టి సారించింది. ఇందుకోసం హైడ్రాను రంగంలోకి దింపడంతో ఈ అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ క్రమంలో ఇన్నాళ్లు కంపుకు అంబాసిడర్‌గా ఉన్న మూసీనది.. తాజా పరిణామాలతో రాజకీయాలకు ఇంపుగా మారిందన్న చర్చ నడుస్తోంది.