calender_icon.png 30 September, 2024 | 6:34 PM

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

30-09-2024 04:57:16 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పోతిరెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా ఎంపీ కొండ సురేఖ, మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరై పంపిణీ చేయాల్సి ఉండగా వారు  రాకపోవడంతో . ఇట్టి కార్యక్రమాన్ని యధావిధిగా  టీజీఐఐసి చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి,  తాసిల్దార్ దేవదాస్ ల చేతుల మీదుగా సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాల  కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, తాసిల్దారులు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.