ఆర్ఐ, ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెండ్
సూర్యాపేట, అక్టోబర్ 16 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లి గ్రామంలో 11 మంది అనర్హులకు కల్యాణలక్ష్మి పథకానికి ఎంపిక చేసి న ఇద్దరు పంచాయతీ కార్యదర్శులతో పాటు ఆర్ఐని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మతేజస్నందలాల్ పవార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మాచినపల్లిలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలు జరిగాయని అందిన ఫిర్యాదు మేర కు ఆర్డీవో, తహసీల్దార్ను విచారణకు ఆదేశించారు. వారి విచార ణలో 11 మంది అనర్హులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందినట్లు తేల డంతో కార్యదర్శులు వెంకట్రెడ్డి, అనిల్తో పాటు నూతనకల్ ఆర్ఐ లక్ష్మీప్రసాద్ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.