calender_icon.png 29 September, 2024 | 3:02 PM

తెలంగాణ యాసకు పట్టం కట్టిన కవి కాళోజీ

09-09-2024 04:31:15 PM

జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జీ సరిత...

వనపర్తి,(విజయక్రాంతి): తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇంచార్జీ సరిత అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా 110వ జయంతి సందర్భంగా గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటాన్నికి జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు...అనంతరం ఆమె మాట్లాడుతూ... నీ బానిసను కానను నేను,తొత్తు కొడుకునసలే కాను,నా ఇష్టం వచ్చినట్టు,నా మనసుకు నచ్చినట్లు,మాట్లాడుతా, రాస్తా అంటూ ఎంతో గొప్ప కవిత్వాలతో తెలంగాణ ఉద్యమానికి బాటలు వేశారని కొనియాడారు...ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  తదితరులు ఉన్నారు.