హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. కాగ్ కాళేశ్వరం నివేదికను కమిషన్ కు ఇచ్చింది. నిపుణుల కమిటీ కమిషన్ అధ్యయన నివేదిక అందించింది. కమిషన్ ముందు 14 మంది పంప్ హౌస్ ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ నెల 16 వరకు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇంజినీర్లకు ఆదేశించింది. కమిషన్ ముందు పంప్ హౌస్ నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అఫిడవిట్లు పరిశీలన తరువాత కాళేశ్వరం కమిషన్ పులువురికి నోటీసులు ఇవ్వనుంది. సాక్ష్యాల నమోదు తర్వాత బహిరంగా విచారణ చేపట్టనుంది కమిషన్.