calender_icon.png 5 October, 2024 | 6:56 PM

బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి 'కాకా' కృషి

05-10-2024 04:32:05 PM

కరీంనగర్,(విజయక్రాంతి): బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి మాజీ కేంద్ర మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి కృషి చేశారని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పేర్కొన్నారు. గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను జిల్లా యువజన అండ్ క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా, అదనపు కలెక్టర్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ''కాకా" చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం చాల సంతోషకరమని వివరించారు. ఈ కార్యక్రమంలో డీ.వై.ఎస్.ఓ రాందాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో రామ్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.