calender_icon.png 5 October, 2024 | 10:49 AM

సింగరేణి కార్మికుల జీవితాల్లో ‘కాకా’ చెరగని ముద్ర

05-10-2024 12:32:04 AM

జయంతి నేపథ్యంలో స్మరించుకున్న సీఎం రేవంత్

హైదరాబాద్, అక్టోబర్ 4(విజయక్రాంతి): సింగరేణి కార్మికుల జీవి తాల్లో కాకా (జీ వెంకటస్వామి) చెరగని ముద్ర వేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయన జీవితం కార్మికులు, పేదలతోనే మమేకమైందని అన్నారు. శుక్రవారం జీ వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాకా సేవలను స్మరించుకున్నారు.

ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజ లకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసారన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కాకా అలుపెరుగని పోరాటం చేసారని, 1969లో తెలంగాణ కోసం జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. నిలువ నీడ లేని నిరుపేదల కోసం పోరాటం చేసి, గుడిసేలు వేయిచారని పేర్కొన్నారు.