హైదరాబాద్: స్టేషన్ఘన్పూర్కు ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ఘన్పూర్ లో కడియం మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.. ప్రజలపై విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికలు రావు.. వస్తే మాత్రం కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. స్టేషన్ఘన్పూర్ లో ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు. అటు బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టిన విషయం తెలిసిందే.