12-04-2025 01:07:26 AM
స్థలాన్ని పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబాఫూలే విగ్రహ ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఫూలే జయంతి రోజే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు శుక్ర వారం సీఎం రేవంత్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, జీహెఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్గౌడ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. విగ్రహం ఏర్పాటుకు సంబంధించి స్థలం కోసం సర్వే చేసి పూర్తిస్థాయి ప్రణాళికలతో నివేదికను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్లో ట్రాఫిక్ తదితర సమ స్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని, డిజైనింగ్ రూపకల్పన చేయాలని సూచించారు.