మంత్రులకు ఉద్యోగ జేఏసీ వినతి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): గత ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జేఏసీ నాయకులతో కలిసి ఈ అంశంపై మంత్రులు దామో దర రాజనర్సింహ, శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందించారు. ముఖ్యంగా స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ బదిలీలు జరిగేలా చూడాలని కోరారు.
ఈ విషయమై దామోదర మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో బాధితులను ఆదుకునేందుకు కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. మంత్రులను కలి సిన వారిలో జేఏసీ నాయకులు కె.రామకృ ష్ణ, డా.జి.నిర్మల. పాక రమేష్, స్పౌజ్ ఫోరం ప్రతినిధులు వివేక్ కృష్ణ పాల్గొన్నారు.