ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 3: నగరంలో చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకొని న్యా యం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి డిమాండ్ చేశారు. వనస్థలిపురం రైతు బజార్ వద్ద చిరు వ్యాపారులు వేసుకున్న దుకాణాలు, షెడ్లను అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. రైతుబజార్ వద్ద నిర్వాసితులైన చిరు వ్యాపారులు గురువారం ఎమ్మెల్యేను కలిసి తమ న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా పండ్లు, పూలు, ఇతర సామగ్రిని విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే అరాచకమన్నారు. రేవంత్రెడ్డి సర్కార్ విధ్వంసకర పాలన చేపడు తుందని విమర్శించారు.
రాష్ట్రంలో కూల్చివేతల పాలన కొనసాగుతుందని, హైడ్రా పేరుతో ఇప్పటికే పేదలను ఇళ్లను కూల్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మూసీ వెంట నివాసం ఉంటున్న పేదలపై పడిందన్నారు. ఇందులో భాగంగా వనస్థలిపురం రైతుబజార్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నా యని సమాచారం ఇవ్వకుండా దుకాణాలను కూల్చడం అన్యాయమన్నారు. అధికా రులతో మాట్లాడి చిరువ్యాపారులకు న్యా యం చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.