calender_icon.png 27 September, 2024 | 10:35 PM

వరద బాధితులకు న్యాయం చేయాలి.. ఎమ్మార్వోకి వినతిపత్రం

27-09-2024 08:04:21 PM

కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని చనుపల్లి, కిష్టాపురం, గొండ్రియల, కొత్త గూడెం,గ్రామాల నందు పాలేరు వాగు ఉదృతంగా మారడంతో వరద కుటుంబాలకు న్యాయం చేయాలని బిఆర్ఎస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు సర్వే చేసి పేర్లు రాసుకొని వెళ్లిన లబ్ధిదారుల లిస్టులో బాధితుల పేర్లు లేకపోవడం బాధాకరమని అన్నారు. వరద బాధితుల విషయంలో రాజకీయాలకు అతీతంగా నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సింది పోయి బాధితులకు అన్యాయం చేసే విధంగా కొంతమంది రాజకీయాలు వ్యూహాన్ని అధికారులపై రుద్దడం విడ్డూరంగా ఉందని అన్నారు. బాధితులకు అండగా బిఆర్ఎస్ ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు అఫ్జల్ సైదిరెడ్డి అక్బర్ శివా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.