calender_icon.png 19 April, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి

12-04-2025 01:17:07 AM

  1. హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా షమీమ్ అక్తర్ నియామకం
  2. ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్‌కుమార్ 
  3. ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్రప్రభుత్వం

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త , ఉప లోకాయుక్తా పోస్టులను శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసింది. లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్ కుమార్, హెచ్చా ర్సీ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్, హెచ్చార్సీ సభ్యులుగా శివాడ  ప్రవీణ, బీ కిశోర్‌ను నియమించింది.

ఈ మేరకు శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యా యి. కాగా వీరి  నియామకానికి సంబం ధించిన ప్రతిపాదనకు గత శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలిపారు. 

వ్యవసాయ కుటుంబం నుంచి.. 

నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిర్సనగండ్లకు చెందిన ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1960, మే 4న రాజశేఖర్‌రెడ్డి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయప్రద, రామానుజరెడ్డి. రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో పట్టభద్రుడయ్యారు. కాకతీయ విశ్వ విద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. 1985 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు.

తొలుత అడ్వొ కేట్ మహమూబ్ అలీ వద్ద ప్రాక్టీస్ చేశా రు. నాలుగేళ్ల తర్వాత స్వంతంత్రంగా ప్రాక్టీ స్ మొదలు పెట్టారు. 2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం  ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004లో కేంద్రప్రభుత్వానికి  సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా, 2005లో అసిస్టెంట్  సొలిసిటర్‌గా నియమితులయ్యారు.

సెంట్రల్ ఎక్సైజ్ , కస్టమ్స్, సర్వీస్ కాక్స్‌కు సీనియర్ స్టాం డింగ్ కౌన్సిల్‌గానూ సేవలందించారు. 2013  ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై.. 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేశారు.

 న్యాయమూర్తిగా సేవలు..

1961 జనవరి 1న నల్లగొండలో రహీమున్నీసా బేగం, జాన్ మహమ్మద్‌కు షమీమ్ అక్తర్ జన్మించారు. నల్లగొండలోనే ఆయన పాఠశాల విద్య సాగింది. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాళశాలలో ఆయన బీకాం చదివారు. నాగపూర్‌లోని యూనివర్సి టీ కాలేజ్ ఆఫ్ లా నుంచి న్యాయపట్టా పొందారు. 1996లో హైదరా బాద్ బషీర్‌బాగ్‌లోని పీజీ కాలేజీ ఆఫ్ లా నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 2006లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు.

2002లో నల్లగొండ జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత పలు కోర్టుల్లో న్యాయమూర్తిగా సేవలందించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా, ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. హైకోర్టులో రిజిస్ట్రార్ (జ్యుడిషయల్)గా సేవలందించారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2022 డిసెంబర్‌లో పదవీ విరమణ పొందారు.