హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) : హైదరాబాద్ బషీర్బాగ్లోని లోకాయుక్త కార్యాలయంలో మంగళవారం లోకాయుక్త చైర్మన్ జస్టిస్ సీవీ రాములు జాతీయ జెండాను ఆవిష్కరించగా, లోకాయుక్త వైస్ చైర్మన్ డాక్టర్ వీ నిరంజన్రావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సచివాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.